జగన్ సీఎం కాకుండా, తనను అసెంబ్లీకి రాకుండా ఏ మగాడూ అడ్డుకోలేడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు కౌంట్డౌన్ ప్రారంభమైందని అన్నారు. గుడివాడ బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు తప్ప ఎవరైనా ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ను జైలుకు పంపాయన్నారు. జగన్కు మద్దతు తెలిపినందుకు తనను అనేక మాటలన్నారని తెలిపారు. తాను డబ్బులు తీసుకుని వైఎస్సార్ సీపీలో చేరానని నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్పై చంద్రబాబు తన చెంచాలతో లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. షర్మిల కుటుంబానికి అండగా ఉంటామని కృష్ణాజిల్లా ప్రజలంతా చెప్తున్నారన్నారు. వైఎస్ ఫొటోతోపాటు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబుకు ఆయన బొమ్మ పెట్టుకునే హక్కు లేదని కొడాలి నాని అన్నారు.
వైఎస్పై చంద్రబాబు తన చెంచాలతో లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. షర్మిల కుటుంబానికి అండగా ఉంటామని కృష్ణాజిల్లా ప్రజలంతా చెప్తున్నారన్నారు. వైఎస్ ఫొటోతోపాటు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబుకు ఆయన బొమ్మ పెట్టుకునే హక్కు లేదని కొడాలి నాని అన్నారు.
0 comments:
Post a Comment