దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవిత విశేషాలు, యువనేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్ర, ఆయన వ్యక్తిత్వ విశేషాలతో సచిత్రంగా రూపొందించిన ‘లీడర్ టు లీడర్’ డైరీని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తమ నివాసంలో ఆవిష్కరించారు. ప్రముఖ నవలా రచయిత వేంపల్లి నిరంజన్రెడ్డి ఈ డైరీని రూపొందించారు. డైరీ ఆవిష్కరణ అనంతరం నిరంజన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దివంగత మహానేత రాజశేఖరరెడ్డి అంటే తమకు ఎంతో అభిమానమని పేర్కొన్నారు. 2010 సంవత్సరంలో తొలిసారిగా ఒక డైరీని రూపొందించి వెలువరించామని, ఆ స్పందనకు స్ఫూర్తి పొంది ఈ డైరీని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. డైరీలో మహానేత జీ వితంలోని ముఖ్య ఘట్టాలను, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ విలక్షణ వ్యక్తిత్వా న్ని, ఓదార్పుయాత్ర విశేషాలను కళ్ళకు కట్టినట్లు చూపించామని పేర్కొన్నారు.
Home »
» ‘లీడర్ టు లీడర్’ డైరీ ఆవిష్కరణ
‘లీడర్ టు లీడర్’ డైరీ ఆవిష్కరణ
Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment