ఖమ్మం జిల్లా బయ్యారంలో ఏర్పా టు చేయదలిచిన రక్షణ స్టీల్స్తో తన భర్త బ్రదర్ అనిల్కు సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని షర్మిల చేసిన సవాలుకు దమ్ముంటే ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ నేత జూపూడి ప్రభాకరరావు సవాలు చేశారు. రక్షణ స్టీల్స్ బ్రదర్ అనిల్దేనంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన ప్రతిపక్షాలు షర్మిల సవాలుపై ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి మారెప్పతో కలిసి జూపూడి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందనే సదుద్దేశంతోనే రక్షణ స్టీల్స్కు వైఎస్ ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. జీవో ఎం.ఎస్ 69/2000ను ప్రతిపక్షాలు పూర్తిగా చదివి మాట్లాడాలని సూచించారు. రక్షణ స్టీల్స్కు లాభాలొస్తే అందులో 20 శాతం నిధులు స్థానిక ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించాలని వైఎస్ షరతు విధిం చిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల తవ్వకం కేటాయింపునూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండడం విడ్డూరమన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియదని... తాము చెప్పే అబద్ధాలనే విశ్వసిస్తారనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు.
దళిత బాంధవుడు వైఎస్సార్: మారెప్ప
దళితుల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్సార్ ఎంతగానో పాటుపడ్డారని, దళితులకు ఆయన చేసినంత మేలు మరే సీఎం చేయలేదని మారెప్ప తెలిపారు. పదవులు, పైరవీల కోసమే కాంగ్రెస్, టీడీపీ నేతలు వై.ఎస్.పై నోరుపారేసుకుంటున్నారని విమర్శించారు. విజన్ 2020 పేరుతో 420 పథకాలు పెట్టి దళితులు, బీసీలను చంద్రబాబు నిండా ముంచారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. 3 వేల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటి గురించి పట్టించుకోని ప్రభుత్వం ఆర్భాటాలతో కొత్త పథకాలు ప్రకటిస్తోంది. ప్రభుత్వ ప్రచారమే తప్ప వాటితో దళితులకు ఒరిగిందేమీ లేద’ని విమర్శించారు.
0 comments:
Post a Comment