ముందు మంత్రి ఆనంనే ఉరితీయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముందు మంత్రి ఆనంనే ఉరితీయాలి

ముందు మంత్రి ఆనంనే ఉరితీయాలి

Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం అధికార మదంతో మాట్లాడారన్నారు. ఆయన మదాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి పార్థసారధి సమర్థిస్తున్నారని విమర్శించారు. జగన్ కేసులో ఉన్న ఆరుగురు మంత్రులను ప్రభావితం చేయడానికే ఆనం ఈ నాటకం ఆడుతున్నారన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించిన మంత్రి ఆనంనే ముందు ఉరితీయాలన్నారు. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని లేదా పిచ్చాస్పత్రిలో చేర్చాలని చెప్పారు. జగన్ ను భౌతికంగా లేకుండా చేయాలని కాంగ్రెస్, టిడిపిలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు చేశారు. మంత్రి ఆనం దిష్టిబొమ్మలను ఉరి తీశారు. తగులబెట్టారు. మంత్రిని మానసిక రోగుల ఆస్పత్రిలో చేర్చాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లోని మాదాపూర్ లో మంత్రి ఆనం వ్యాఖ్యలకు నిసనగా వైఎస్‌ఆర్‌సీపీ నేత రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సికింద్రాబాద్ రాణిగంజ్‌లో శీలం ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దహనం చేశారు. రాణీగంజ్ పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

కరీంనగర్ లో మంత్రి ఆనంపై డిఎస్ పి చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ నేత మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తాడికొండ అడ్డరోడ్డు, దాచేపల్లి, ముప్పాళ్ల, మేడికొండూరులలో ఆనం దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నకిరెకల్ లలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ లో వైఎస్‌ఆర్ సీపీ బాధ్యుడు కృష్ణమోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఇయ్యంబంజర్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం, వికోట, పలమనేరులలో మంత్రి ఆనం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే బాబ్జి ఆధ్వర్యంలో ఆనం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయరహదారిపైన, ముమ్మిడివరంలలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు.
Share this article :

0 comments: