మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 113వ రోజు శనివారం కోడూరులో ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. కలవపూడి సత్రం, పెదపాలపర్రు, చౌటుపల్లి, కొత్తమల్లాయిపాలెం వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం మల్లాయిపాలెం గేటు, నక్కల కాల్వ, బంటుమిల్లి రోడ్డు, ముబారక్ సెంటర్, ఓల్డ్ బైపాస్ రోడ్డు, గుడ్మాన్పేట, బస్టాండ్ వరకు పాదయాత్ర సాగిన తరువాత నెహ్రూచౌక్లో బహిరంగ సభ జరుగుతుందని, ఏలూరు రోడ్డు వద్ద షర్మిల రాత్రి బస చేస్తారని చెప్పారు.
పర్యటించే ప్రాంతాలు
కోడూరు, కలవపూడి సత్రం, పెదపాలపర్రు, చౌటుపల్లి, కొత్తమల్లాయిపాలెం, మల్లాయిపాలెం గేటు, నక్కల కాల్వ, బంటుమిల్లి రోడ్డు, ముబారక్ సెంటర్, ఓల్డ్ బైపాస్రోడ్డు, గుడ్మాన్పేట, బస్టాండ్, నెహ్రూచౌక్, ఏలూరురోడ్డు.
పర్యటించే ప్రాంతాలు
కోడూరు, కలవపూడి సత్రం, పెదపాలపర్రు, చౌటుపల్లి, కొత్తమల్లాయిపాలెం, మల్లాయిపాలెం గేటు, నక్కల కాల్వ, బంటుమిల్లి రోడ్డు, ముబారక్ సెంటర్, ఓల్డ్ బైపాస్రోడ్డు, గుడ్మాన్పేట, బస్టాండ్, నెహ్రూచౌక్, ఏలూరురోడ్డు.
0 comments:
Post a Comment