బుడిదంపాడు:షర్మిల ఎడమ కాలు మడమకు గాయం అయింది. పాదయాత్రలో భాగంగా ఆమె బుడిదంపాడు రచ్చబండలో పాల్గొని బయలు దేరారు. కొద్దిదూరం నడవగానే జనం తోపులాట ఎక్కువైంది. కొందరు అదుపు తప్పి ఆమె కాళ్లకు అడ్డంపడ్డారు. వారిని తప్పించే ప్రయత్నంలో ఆమె కాలు గుంతలో పడి మడమ బెణికింది. గతంలో షర్మిల కుడి మోకాలు గాయానికి సర్జరీ చేసిన డాక్టర్ సీఎస్ రెడ్డి ప్రతి ఆదివారం వచ్చి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఎస్ రెడ్డి షర్మిలకు ప్రథమ చికిత్స చేశారు. ఆ నొప్పితోనే షర్మిల కొంతదూరం నడిచి మధ్యాహ్న భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు. నొప్పి తీవ్రం కావడంతో డాక్టర్ సీఎస్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మడమ భాగంలోని కండరానికి గాయమైందని, కనీసం ఒకరోజు విరామం తీసుకోవాలని వారు సూచించారు. దీంతో సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. సోమవారం పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత యాత్ర తదుపరి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.
Home »
» :షర్మిల ఎడమ కాలుకు గాయం ,పాదయాత్రకు విరామం
:షర్మిల ఎడమ కాలుకు గాయం ,పాదయాత్రకు విరామం
Written By news on Monday, April 29, 2013 | 4/29/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment