వైఎస్సార్ హయాంలో జీఓలు తెచ్చింది కేబినెట్టా.. కాదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ హయాంలో జీఓలు తెచ్చింది కేబినెట్టా.. కాదా?

వైఎస్సార్ హయాంలో జీఓలు తెచ్చింది కేబినెట్టా.. కాదా?

Written By news on Monday, April 15, 2013 | 4/15/2013

వైఎస్సార్ హయాంలో జీఓలు తెచ్చింది కేబినెట్టా.. కాదా?
మంత్రులు సబిత, ధర్మానను ఎందుకు అరెస్ట్ చేయరు?
కాంగ్రెస్ వైఖరిపై మాజీ మంత్రి కొండా సురేఖ ధ్వజం

శాయంపేట, న్యూస్‌లైన్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కాస్తా కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌గా మారిందని మాజీమంత్రి కొండా సురేఖ ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే నేతలపై కాంగ్రెస్.. సీబీఐ అస్త్రాన్ని ప్రయోగిస్తూ దారికి తెచ్చుకుంటోందని ఆరోపించారు. చార్జిషీట్ల పేరుతో జైలునుంచి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకోవాలని చూస్తోందని విమర్శించారు. వరంగల్ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆది వారం సురేఖ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదలైన జీఓ లన్నీ ఆయనే విడుదల చేశారా.. లేక కేబినెట్ ఆమోదంతో విడుదలయ్యాయా.. లేదా అప్పటి మంత్రుల వల్లే విడుదలయ్యాయా? అనే అంశాన్ని ప్రజల ముందుకు తేవాల్సిన అవసరం ఉందన్నారు. జరిగిన పరిణామాలను బట్టి చూస్తే మంత్రుల మధ్యే సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మరో మంత్రి ధర్మానప్రసాదరావు వ్యవహారంలో సీబీఐ చార్జిషీట్ దాఖలైన ప్పటికీ వారిని అరెస్ట్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. 
Share this article :

0 comments: