విజయవాడ: అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. సాక్షులను ప్రభావితం చేసే స్థాయి హోంమంత్రికి ఉంటుందా, జగన్కు ఉంటుందా అనేది సీబీఐ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పాదయాత్రలో భాగంగా హనుమాన్ జంక్షన్ లో జరిగిన బహిరంభ సభలో షర్మిల మాట్లాడారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకం కాంగ్రెస్ పాలనలో సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. మద్యంలో మత్తులో జరుగుతున్న దారుణాలకు తెనాలి ఘటనే ఉదాహరణ అన్నారు. ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయని, వీటిని మూయించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. బెల్ట్ షాపులు వద్దని మహిళలు రోదిస్తున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే మద్యాన్ని సరసమైన ధరకు అందించే బాధ్యత తన భుజాన వేసుకుంటానని చంద్రబాబు చెప్పడాన్ని షర్మిల తప్పుబట్టారు. అన్ని రంగాల్లో విఫలమైన కిరణ్ సర్కారును చంద్రబాబు కాపాడుతున్నారని ఆమె ఆరోపించారు. జగగన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తాడని ఆమె భోరోసా ఇచ్చారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకం కాంగ్రెస్ పాలనలో సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. మద్యంలో మత్తులో జరుగుతున్న దారుణాలకు తెనాలి ఘటనే ఉదాహరణ అన్నారు. ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయని, వీటిని మూయించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. బెల్ట్ షాపులు వద్దని మహిళలు రోదిస్తున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే మద్యాన్ని సరసమైన ధరకు అందించే బాధ్యత తన భుజాన వేసుకుంటానని చంద్రబాబు చెప్పడాన్ని షర్మిల తప్పుబట్టారు. అన్ని రంగాల్లో విఫలమైన కిరణ్ సర్కారును చంద్రబాబు కాపాడుతున్నారని ఆమె ఆరోపించారు. జగగన్న బయటకు వచ్చి రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తాడని ఆమె భోరోసా ఇచ్చారు.
0 comments:
Post a Comment