Home »
» నేడూ షర్మిల పాదయాత్ర విరామం
నేడూ షర్మిల పాదయాత్ర విరామం
|
|
|
రేపు యథావిధిగా పాదయాత్ర
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎడమకాలి మడమకు గాయం కారణంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు సోమవారం విరామం ప్రకటించిన విషయం విదితమే. అయితే నొప్పి తగ్గక పోవడంతో వైద్యుల సూచన మేరకు మంగళవారం కూడా విరామం ఇస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. పాదయాత్ర తిరిగి బుధవారం యథాతధంగా కొనసాగనుందని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో కాలికి గాయమైన షర్మిలను విశ్రాంతి కేంద్రంలో ఆమె భర్త అనిల్కుమార్, వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులు మైసూరారెడ్డి, తెలంగాణ ఐదు జిల్లాల కో-ఆర్డినేటర్ కేకే మహేందర్రెడ్డి పరామర్శించారు. గాయం విషయంపై వైద్యులతో చర్చించారు. స్థానిక నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మచ్చా శ్రీనివాసరావు తదితరులు కూడా షర్మిలను పరామర్శించారు.
|
|
0 comments:
Post a Comment