వైఎస్ హయాంలో రైతు రాజులా బతికాడని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. రైతు పంట కోల్పోతే వైఎస్ నష్టపరిహారం అందించారని, రూ.12వేల కోట్ల రుణమాపీ చేశారని గుర్తు చేశారు. టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్కు అమ్మేశారని, అందుకే ప్రజలపై రూ. 30వేల కోట్ల కరెంట్ భారం వేసినా నోరు మెదపడం లేదని ఆరోపించారు. హిట్లర్, చంద్రబాబు పుట్టిన తేదీ ఒక్కటేనని, అందుకే ఇద్దరి ఆలోచనలకు దగ్గరి పోలికలున్నాయని అన్నారు.
మొదట చంద్రబాబు జగన్పై ఆరోపణలు చేస్తారని, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటెంగా ప్రకటిస్తాయని చెప్పారు. దాన్ని కాంగ్రెస్ అందుకొని వంతపాడుతుందని అన్నారు. ఆ తర్వాత ఈడీ, సీబీఐలు కోర్టులో ఇదే వాదనలు వినిపిస్తాయని అన్నారు. జగన్ను ఆపే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదని షర్మిల అన్నారు.
మొదట చంద్రబాబు జగన్పై ఆరోపణలు చేస్తారని, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటెంగా ప్రకటిస్తాయని చెప్పారు. దాన్ని కాంగ్రెస్ అందుకొని వంతపాడుతుందని అన్నారు. ఆ తర్వాత ఈడీ, సీబీఐలు కోర్టులో ఇదే వాదనలు వినిపిస్తాయని అన్నారు. జగన్ను ఆపే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేదని షర్మిల అన్నారు.
0 comments:
Post a Comment