సీఎం విద్యుత్ ప్రకటనపై విజయమ్మ అసంతృప్తి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం విద్యుత్ ప్రకటనపై విజయమ్మ అసంతృప్తి!

సీఎం విద్యుత్ ప్రకటనపై విజయమ్మ అసంతృప్తి!

Written By news on Thursday, April 4, 2013 | 4/04/2013

విద్యుత్ చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం చేసిన ప్రకటన హర్షణీయం కాదని విజయమ్మ అన్నారు. కుటీర పరిశ్రమలు, వ్యవసాయం గురించి ఒక్కమాటకూడా చెప్పలేదని, ఉచిత విద్యుత్‌పై కూడా ఒక్కమాట లేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డున పడ్డ కార్మికుల గురించి, నేత కార్మికుల గురించి సీఎం పట్టించుకోలేదని.. వారి గురించి ఏం మాట్లాడుతారని నేను సూటిగా అడుగుతున్నానని విజయమ్మ నిలదీశారు. 

తాజా ఛార్జీలు కారణంగా ప్రజలపై ఆరువేల కోట్ల భారం మోపారని.. కాని ఇప్పుడు ఇచ్చిన మినహాయింపులు 800 కోట్లేనని విజయమ్మ చెప్పారు. గత ఏడాది కంటే కేవలం రెండువందలకోట్లు మాత్రమే తగ్గించారని విజయమ్మ తెలిపారు. తమ డిమాండ్లు తీర్చేవరకూ పోరాటం కొనసాగుతుందని.. రేపటినుంచి ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నామని విజయమ్మ తెలిపారు. 
Share this article :

0 comments: