వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డిపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డీకే అరుణ సభ్యత, సంస్కారం లేకుండా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు అన్నారు. మంత్రులిరువురూ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో గోనె మీడియాతో మాట్లాడారు. ఆనం కుటుంబం రాజకీయ వ్యభిచారం చేస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. ఆనం రామనారాయణ రెడ్డి తండ్రి 1978లో జనతా పార్టీ తరఫున ఓడియారని, 1982లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కాళ్లుపట్టుకుని ఆనం సోదరులు తెలుగుదేశం టికెట్లు తెచ్చుకున్నారని విమర్శించారు. 1996లో వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా ఆనం సోదరులకు టికెట్లు కేటాయించిన విషయం మరిచి ఇప్పుడు సిగ్గు, లజ్జ లేకుండా వైఎస్, జగన్లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోసం ఎన్నో పార్టీలు మారిన ఆనం సోదరులు వైఎస్ను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోవాలన్నారు.
Home »
» ఆనం, అరుణ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి: గోనె
ఆనం, అరుణ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి: గోనె
Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment