ప్రజాసమస్యలపై విజయమ్మ జిల్లా పర్యటనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాసమస్యలపై విజయమ్మ జిల్లా పర్యటనలు

ప్రజాసమస్యలపై విజయమ్మ జిల్లా పర్యటనలు

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నిర్ణయించారు. అన్ని వర్గాల ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న సంకల్పంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండూ కుమ్మక్కై ప్రజా సమస్యలను విస్మరిస్తున్న నేపథ్యంలో ప్రజాపక్షంగా వారికి మద్దతుగా నిలవాలని భావించినట్టు వైఎస్సార్‌సీపీ వివరించింది. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్ సమస్యలను, రైతుల ఇబ్బందులను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఏప్రిల్ 27న విజయమ్మ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా పార్టీ కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి కార్యక్రమాన్నీ చేవెళ్ల నుంచే ప్రారంభించేవారని గుర్తుచేశారు. విజయమ్మ కూడా అక్కడి నుంచే పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారని చెప్పారు. ‘‘ఏప్రిల్ 27 ఉదయం పదింటికి విజయమ్మ పర్యటనకు బయల్దేరతారు. చేవెళ్ల వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత స్థానికంగా రచ్చబండ నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుకుంటారు. తర్వాత పరిగి నియోజకవర్గం చిట్టింపల్లి గ్రామంలో రచ్చబండ నిర్వహిస్తారు. సాయంత్రం వికారాబాద్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు’’ అని జనార్దన్‌రెడ్డి వివరించారు.
Share this article :

0 comments: