మోవిదేవిని ఎలా బలిపశువును చేశారో అలాగే మిగతా ఐదుగురు మంత్రులను బలిపశువులను చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వివాదస్పద 26 జీవోల విషయంలో కోర్టులో ఒక మాట, బయట మరో మాట చెబుతోందన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు ఆయనవి కాదట, వివాదస్పద జీవోలు మాత్రం ఆయనవేనని ప్రభుత్వం చెప్పడాన్ని అంబటి తప్పుబట్టారు. నీచమైన రాజకీయ కుట్రలతో జగన్ ను మరింత కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నిరాశ, నిస్పృహతో తమ పార్టీపై కాంగ్రెస్ కుతంత్రాలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్ కుట్రలను ఓటు ఆయుధంలో ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.
Home »
» కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతారు: అంబటి
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతారు: అంబటి
Written By news on Monday, April 15, 2013 | 4/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment