బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షా శిబిరంలోనే జరుపుకుంది. శుక్రవారం ఉదయం ఆయన చిత్రపటానికి పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా విజయమ్మ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ దళితుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు.
అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ చేసిన సేవలను కొనియాడారు. బాబూ జగ్జీవన్ రాం అందరికీ చిరస్మరణీయులని, ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా దళితుల సంక్షేమానికి పాటుపడ్డారని ఆమె అన్నారు.
అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ చేసిన సేవలను కొనియాడారు. బాబూ జగ్జీవన్ రాం అందరికీ చిరస్మరణీయులని, ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా దళితుల సంక్షేమానికి పాటుపడ్డారని ఆమె అన్నారు.
0 comments:
Post a Comment