Home »
» తెనాలి ఘటన దారుణం: వైఎస్ విజయమ్మ
తెనాలి ఘటన దారుణం: వైఎస్ విజయమ్మ
|
తెనాలి ఘటన బాధాకరమని వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. తెనాలి ఘటన చూస్తే మహిళలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నడిబజారులో యువతిని వేధించడం చాలా దారుణమని వైఎస్ విజయమ్మ అన్నారు.
యువతిపై మానభంగాన్ని అడ్డుకున్న తల్లిని లారీ కింద తోసి చంపడం ఘోరమైన విషయమని వైఎస్ విజయమ్మఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని, సునీల హంతకులను కఠినంగా శిక్షించాలని వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.
నిందితులు ఎంతటివారైనా వదలొద్దని, నడిరోడ్లపై మద్యం షాపుల వల్ల నేరాలు పెరుగుతున్నాయన్నారు. వైఎస్ మరణం తర్వాత ఎక్సైజ్ ఆదాయం 5వేల కోట్లు రూపాయలకు పెరిగిందన్నారు. సునీల ఘటనను అసెంబ్లీలో లేవనెత్తుతామని, చట్టాలున్నా పాలకులు సరిగా లేకుంటే ప్రయోజనమేంటి అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. సునీల కుటుంబసభ్యులకు వైఎస్ విజయమ్మ పరామర్శించారు.
|
|
0 comments:
Post a Comment