కడ్తాల, న్యూస్లైన్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను వేధిస్తున్న తీరుతో మనస్తాపం చెందిన వైఎస్ అభిమాని ఒకరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలో శనివారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కాళ్ల గణేష్(35)ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడు భార్య అమృతమ్మ, కొడుకు మురళి, తల్లి వెంకటమ్మతో కలిసి గ్రామంలోనే నివాసం ఉంటున్నాడు. గణేష్ వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమాని. గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నాడు. రాజన్న కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమకేసులు బనాయించి 11 నెలలుగా జైల్లో బంధించడం పట్ల ఆవేదన వ్యక్తంచేసేవాడు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకుని, తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు. సూసైడ్ నోట్లో...‘రాజన్న రాజ్యం రావాలి.. జగనన్న జైలు నుంచి రావాలి. వైఎస్ కుటుంబంపై విమర్శలు మానుకోవాలి. జై జగన్...జై వైఎస్ఆర్.. జై షర్మిల’.. అని ఉంది. తను ధరించిన టీషర్టుపై కూడా ‘జై జగన్.. జై షర్మిల’ అని రాసుకున్నాడు.
Home »
» వైఎస్ అభిమాని ఆత్మహత్య
వైఎస్ అభిమాని ఆత్మహత్య
Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment