సుప్రీంనే తప్పుదోవ పట్టిస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంనే తప్పుదోవ పట్టిస్తోంది

సుప్రీంనే తప్పుదోవ పట్టిస్తోంది

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసుల విషయంలో సీబీఐ సుప్రీంకోర్టు ధర్మాసనాన్నే తప్పుదోవ పట్టిస్తోందని, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకే వక్రభాష్యం చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి మండిపడ్డారు. జగన్‌కు బెయిల్ రాకుండా జాప్యం చేసేందుకే సీబీఐ ఇలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీబీఐ తీరుపై విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... ‘‘గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టులో బెయిల్‌పై వాదనలు జరిగినపుడు ఏడు అంశాలపై ద
ర్యాప్తు చేయడానికి ఎంత సమయం పడుతుందో సీబీఐ లిఖితపూర్వకంగా తెలిపింది. ఒక్కో అంశంపై రెండు, మూడు మాసాలు సమయం పడుతుందని వారు సమర్పించిన అఫిడవిట్లలో స్పష్టంగా పేర్కొన్నారు. అవేమీ రహస్య డాక్యుమెంట్లు కాదు కూడా.. జగన్ కేసుల దర్యాప్తులో సీబీఐ ఏమాత్రం సమయం వృథా చేయడం లేదని, దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఫైనల్ చార్జిషీటు వేస్తుందని అత్యున్నత న్యాయస్థానం ముందు సీబీఐ తరఫున వాదించిన పరాశరన్ చెప్పారు. పరాశరన్ చెప్పిన విషయాలను, సీబీఐ అఫిడవిట్‌లో లిఖితపూర్వకంగా పేర్కొన్న వాటినే సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. మార్చి 31వ తేదీలోపుగా పూర్తి చేయాలనేది దీనర్థం.. కానీ సీబీఐ ఈ పదజాలాన్ని తప్పుదోవ పట్టించి చార్జిషీటు వేయడం లేదు. ఇదంతా జగన్‌కు బెయిల్ రాకుండా జాప్యం చేయడానికే...’’ అని ఆయన అన్నారు. ‘‘ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా బెయిల్ ప్రక్రియను అడ్డుకోకూడదు.. కేవలం రాజకీయ పక్షపాతంతో, ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై సీబీఐ అక్రమాలకు పాల్పడ్డం దుర్మార్గం... సీబీఐ ఇలా చేస్తున్నందుకు ఏరోజుకైనా జవాబు చెప్పాల్సి ఉంటుంది.

మాది దర్యాప్తు సంస్థ కనుక తమను ఎవరూ ప్రశ్నించకూడదనే అహం కారంతో వ్యవహరిస్తే జవాబు చెప్పక తప్పదు...’’ అని మైసూరా అన్నారు. సుప్రీంకోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని న్యాయస్థానం ముందు ఉంచుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ నిందితురాలిగా చేర్చిన విషయంపై స్పందిస్తూ.. ‘‘ఇది ప్రభుత్వం తప్పుడు పనుల వల్ల జరుగుతోంది. సీబీఐ చేస్తున్నది తప్పు అనీ, జీవోలన్నీ ప్రభుత్వ విధానంలో భాగంగా జారీ అయినవేనని, విధానంలో భాగంగా తీసుకున్న చర్యల వల్లే జీవోలు వచ్చాయని ఎపుడో సుప్రీంకోర్టులో వాళ్లు (ప్రభుత్వం) అఫిడవిట్ దాఖలు చేసి ఉండాల్సింది. కానీ కేవలం జగన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆయనను ఇబ్బందుల పాలు చే సేందుకు దొంగాటలు ఆడింది. ఇప్పుడు అది వారి మెడకే చుట్టుకుంది. మంత్రులకూ చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వం ఉంది. జీవోల జారీ ప్రభుత్వ విధానాల ప్రకారమే జరిగిందని ఆనాడు చెప్పకపోవడం దుర్మార్గం. దుర్మార్గపు ఆలోచనల వల్లే వారే ఇరుక్కుపోయారు.’ అని మైసూరా అన్నారు. సబిత రాజీనామా, నైతికత గురించి ఆమె, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు.
Share this article :

0 comments: