తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చంద్రబాబు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడి, భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి పిటిషనర్లను ఆదేశించారు. విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలువురికి అక్రమంగా లబ్ధి చేకూర్చి తాను ప్రయోజనాలు పొందారని, ఈ వ్యవహారాలపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఈడీల దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుంకరి జనార్దన్ దాఖలు చేసిన పిటిషన్ను లోకాయుక్త శుక్రవారం విచారించారు. బాబు ఆస్తుల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజకీయ కారణాలతో వేసిన పిటిషన్ అని చెప్పి దాన్ని హైకోర్టు కొట్టివేసిందని జనార్దన్ వివరించారు.
source:sakshi
source:sakshi
0 comments:
Post a Comment