Home »
» ప్రాణమిత్ర అవార్డుతో బాబును సత్కరించాలి
ప్రాణమిత్ర అవార్డుతో బాబును సత్కరించాలి
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా అధికారపక్షాన్ని ఆదుకున్న ఘనత టీడీపీదేనని, అందుకు చంద్రబాబుకు ఉగాది సందర్భంగా ఇచ్చే పురస్కారాల్లో భాగంగా ‘ప్రాణమిత్ర’ అవార్డును ఇచ్చి బహిరంగంగా సత్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉగాది సందర్భంగా పురస్కారాలు ఇచ్చి సత్కరించడం ఆనవాయితీ. ప్రభుత్వానికి పూర్తిగా అండదండలు అందించిన ‘తెలుగు-కాంగ్రెస్’ నేత చంద్రబాబుకు ప్రాణమిత్ర అవార్డును ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి తన చేతుల మీదుగా ఈ అవార్డును ఇవ్వాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి బాబును ఉద్దేశించి ‘నడక మిత్రుడు’ అని సంబోధిస్తున్నారని, అందువల్ల ప్రాణమిత్రను ఆయనకు ఇవ్వడం సముచితంగా ఉంటుందని వివరించారు.
|
|
0 comments:
Post a Comment