కేంద్రం కనుసన్నల్లో సీబీఐ పనిచేస్తోందని తాము చెప్పిందే నిజమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. సీబీఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తమ వాదనకు బలం చేకూర్చాయన్నారు.
ఇతర రాజకీయ పార్టీలు కూడా సీబీఐపై ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నాయన్నాయని చెప్పారు. సీబీఐని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆయుధంగా వాడుకుంటోందన్నారు. బొగ్గు కుంభకోణంలో ఇది మరోసారి రుజువైందన్నారు. బొగ్గు కుంభకోణంలో పిఎంఓ వ్యవహరించిన తీరుపై ప్రజలంతా సిగ్గుపడుతున్నారని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తుపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని చెప్పారు. సీబీఐ ఇలాగే వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. |
Home »
» కేంద్రం కనుసన్నల్లో సీబీఐ: అంబటి
కేంద్రం కనుసన్నల్లో సీబీఐ: అంబటి
Written By news on Tuesday, April 30, 2013 | 4/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment