ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాల కన్నీరు వరదలై పారుతోందన్న సీఎం వ్యాఖ్యలు అర్థరహితమని ఆమె శనివారమిక్కడ అన్నారు. ప్రజల కన్నీటి వరదలో ఇటువంటి ముఖ్యమంత్రులు కొట్టుకుపోతారని విజయమ్మ వ్యాఖ్యానించారు.
కరెంట్ సమస్యపై రెఫరెండానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని విజయమ్మ సవాల్ విసిరారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించి ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే తాము దీక్ష చేస్తున్నామని, తమ దీక్షను సీఎం ఎగతాళి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. కరెంట్ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్దామని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుందని అన్నారు.
ఇప్పుడంతా బావుందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని విజయమ్మ ప్రశ్నించారు. పల్లెలకు వెళితే కరెంట్ కష్టాలేంటో ముఖ్యమంత్రికి తెలుస్తాయని ఆమె అన్నారు. ప్రజా బ్యాలెట్ కు మంచి స్పందన లభిస్తోందని విజయమ్మ తెలిపారు. ఈనెల 9న జరిగే బంద్ ను విజయవంతం చేయాలని ఆమె ప్రజలను కోరారు. కాగా కరెంట్ ఛార్జీలు, విద్యుత్ కోతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష నేటికి అయిదోరోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా నీరసించిపోయారు.
కరెంట్ సమస్యపై రెఫరెండానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని విజయమ్మ సవాల్ విసిరారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించి ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసమే తాము దీక్ష చేస్తున్నామని, తమ దీక్షను సీఎం ఎగతాళి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. కరెంట్ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్దామని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుందని అన్నారు.
ఇప్పుడంతా బావుందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని విజయమ్మ ప్రశ్నించారు. పల్లెలకు వెళితే కరెంట్ కష్టాలేంటో ముఖ్యమంత్రికి తెలుస్తాయని ఆమె అన్నారు. ప్రజా బ్యాలెట్ కు మంచి స్పందన లభిస్తోందని విజయమ్మ తెలిపారు. ఈనెల 9న జరిగే బంద్ ను విజయవంతం చేయాలని ఆమె ప్రజలను కోరారు. కాగా కరెంట్ ఛార్జీలు, విద్యుత్ కోతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష నేటికి అయిదోరోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా నీరసించిపోయారు.
0 comments:
Post a Comment