కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన షర్మిల పాదయాత్ర సభలో జనప్రభంజనం కనిపించింది. తెలుగుదేశం నేత దేవినేని ఉమ నియోజకవర్గంలో జగన్ నినాదాలు హోరెత్తాయి. ఈ సభలో కొడాలి నాని, జోగి రమేష్, జలీల్ ఖాన్ లు మాట్లాడారు. దేవినేని ఉమ బ్రోకర్ అంటూ కొడాలినాని మండిపడ్డారు. ఆనం రాంనారాయణరెడ్డి లాంటి వారు పిచ్చికుక్కల్లా వాగుతున్నారని, ఇలాంటి రాజకీయ వ్యభిచారులకు ఘాటుగా సమాధానం చెప్పాలని కొడాలి నాని అన్నారు. మైలవరం ప్రజలు దేవినేని ఉమకు ఎట్టిపరిస్థితుల్లో ఓట్లు వేయొద్దని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. దమ్ముంటే ఎన్నికలకు రావాలంటూ బొత్స, ఆనంలకు జలీల్ఖాన్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలే ఉరితీస్తారని ఈ సభలో జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
Home »
» దేవినేని ఉమ ఓ బ్రోకర్: కొడాలినాని
దేవినేని ఉమ ఓ బ్రోకర్: కొడాలినాని
Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment