అమ్మహస్తం పథకం పేరు మాయహస్తంగా మార్చుకుంటే మంచిదని వైఎస్ఆర్ సీపీ నేత గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప.. పథక అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఇప్పటిదాకా 10శాతం మంది లబ్దిదారులకు కూడా పథకాన్ని అమలుచేయలేదని ఆయన ఎద్దేవా చేశారు.
పథక అమలుకు ఏడాదికి 2,764 కోట్లు అవసరమైతే.. 685 కోట్లే కేటాయించారని, కిరణ్ సీఎం అయ్యాక నిత్యావసర ధరలు 500శాతం పెరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చడానికే అమ్మహస్తం, సరుకుల సంచుల కొనుగోలులో కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సంచుల కొనుగోలులో కోట్ల రూపాయలు చేతులు మారాయని, సంచుల కొనుగోళ్లపై దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ఆర్ సీపీ నేత గడికోట శ్రీకాంత్రెడ్డి సూచించారు.
పథక అమలుకు ఏడాదికి 2,764 కోట్లు అవసరమైతే.. 685 కోట్లే కేటాయించారని, కిరణ్ సీఎం అయ్యాక నిత్యావసర ధరలు 500శాతం పెరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చడానికే అమ్మహస్తం, సరుకుల సంచుల కొనుగోలులో కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. సంచుల కొనుగోలులో కోట్ల రూపాయలు చేతులు మారాయని, సంచుల కొనుగోళ్లపై దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ఆర్ సీపీ నేత గడికోట శ్రీకాంత్రెడ్డి సూచించారు.
0 comments:
Post a Comment