‘దీక్షల వల్ల లాభమేంటని కొంతమంది మాట్లాడుతున్నారు. దీక్షల కారణంగానే రూ. 12,700 కోట్ల విద్యుత్ చార్జీల భారం రూ. 6,500 కోట్లకు పరిమితమైంది. దీక్షల వల్లే 200 యూనిట్లలోపు వారికి పెంపు నుంచి మినహాయింపు లభించింది. దీక్షలే లేకపోతే 2 యూనిట్లు వాడుకునే వారికీ చార్జీలు పెరిగేవి’
-నాగేశ్వర్, ఎమ్మెల్సీ ప్రజలపై పెనుభారం మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కరెంట్ సత్యాగ్రహ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. నిరాహార దీక్షలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను శుక్రవారం పలువురు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ నాగేశ్వర్, సినీనటుడు నరేష్ దీక్షా శిబిరం వద్దకు వచ్చి తమ మద్దతు ప్రకటించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డితో పాటు తెలంగాణ లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు కంచర్ల ధర్మారెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపారు. పోరాడితే ప్రజావ్యతిరేకులా?: నాగేశ్వర్ విద్యుత్ చార్జీల పెంపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ‘ఒక మనిషి చెయ్యి నరికి, తర్వాత కృత్రిమ చెయ్యి అతుకు పెట్టి.. మేం చేయూత నిస్తున్నాం’ అని చెప్పుకుంటున్నట్టు ఉందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఎద్దేవా చేశారు. విజయమ్మ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. గతంలో టీడీపీ చార్జీలు పెంచితే వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలను పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నాయని విమర్శించడాన్ని తప్పుపట్టారు. రిలయన్స్ లాంటి పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతోంది కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కాదా అని నాగేశ్వర్ ప్రశ్నించారు. రూ. 6 వేల కోట్ల చార్జీలను పెంచితే అది ప్రజల ప్రభుత్వం.. చార్జీల భారం తగ్గించమని పోరాడుతున్న వారు ప్రజావ్యతిరేకులా అని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ప్రభుత్వం దీక్షలను భగ్నం చేయవచ్చునేమోగానీ, ప్రజల గుండెల్లో రగులుతున్న అగ్నిని మాత్రం భగ్నం చేయలేదన్నారు. సర్వం త్యాగం చేసిన వైఎస్ కుటుంబం: నరేష్ ప్రజాసమస్యలపై ఎవరెన్ని పోరాటాలు చేసినా వైఎస్సార్ కుటుంబానికి ఉన్న పోరాట పటిమ ఈ దేశంలో వేరెవ్వరికీ లేదని సినీ నటుడు నరేష్ అన్నారు. విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. వైఎస్ కుటుంబం సర్వం త్యాగం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతోందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించి, రాష్ట్ర ప్రజలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. |
Home »
» విజయమ్మ సత్యాగ్రహ దీక్షకు పలువురు నేతల సంఘీభావం
విజయమ్మ సత్యాగ్రహ దీక్షకు పలువురు నేతల సంఘీభావం
Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment