నెల్లూరు : ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరులో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన ఆందోళన సోమవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు, నెల్లూరు నగర సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు ఉదయం గాంధీబొమ్మ వద్దకు చేరుకున్నారు.
మంత్రి ఆనం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మంత్రికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలను జరగనివ్వరాదని పోలీసులకు ఆనం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. |
Home »
» నెల్లూరులో వైఎస్ఆర్ సీపీ ఆందోళన
నెల్లూరులో వైఎస్ఆర్ సీపీ ఆందోళన
Written By news on Monday, April 15, 2013 | 4/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment