కరెంట్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతమైందని వైఎస్ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి తెలిపారు. ఈ బంద్ ప్రజాభిప్రాయానికి అద్దం పడుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, లేకపోతే మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. సీబీఐ సుప్రీంకోర్టునే తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై ఆందోళన నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ నేత ముక్కా రూపానందరెడ్డి, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేముందు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నేతలు ఆరోపించారు.
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మద్దతుతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్చీలు పెంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. కొండపిలో జరిగిన విద్యుత్ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణ అన్నారు.
హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై ఆందోళన నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ నేత ముక్కా రూపానందరెడ్డి, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేముందు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నేతలు ఆరోపించారు.
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మద్దతుతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్చీలు పెంచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు విమర్శించారు. కొండపిలో జరిగిన విద్యుత్ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణ అన్నారు.
0 comments:
Post a Comment