వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అమ్మమ్మ సోమమ్మ కన్నుమూయడంతో షర్మిల కడపకు బయలుదేరి వెళ్లారు. దీంతో సోమవారం జరగాల్సిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు పాదయాత్ర కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. పాదయాత్ర మంగళవారం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆదివారం ఉదయం పాదయాత్రలో ఉండగానే సోమమ్మ చనిపోయిన విషయం షర్మిలకు తెలిసింది. అయినా ఆమె మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు యాత్రను కొనసాగించారు. జొన్నపాడులో రచ్చబండ నిర్వహించారు. పుట్టపాడు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కడపకు బయల్దేరారు. ఆదివారం రాత్రి 10.20గంటలకు ఆమె కడపకు చేరుకొని సోమమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
Home »
» షర్మిల పాదయాత్రకు నేడు విరామం
షర్మిల పాదయాత్రకు నేడు విరామం
Written By news on Monday, April 8, 2013 | 4/08/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment