రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013

రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. దాంతో బస్సులు నిలిచిపోయాయి. దుకాణాలు మూతపడ్డాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు, కోతలకు నిరసనగా ఇవాళ విపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపుకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారు. హైదరాబాద్ - ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ వద్ద వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు బస్సులను అడ్డుకోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

విశాఖ,విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, తిరుపతి, వరంగల్‌, కరీంనగర్‌,వరంగల్,ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వ్యాపారులు దుకాణాలు తెరవలేదు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, సర్‌ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. పలు చోట్ల ఆందోళనకు దిగిన విపక్ష నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
Share this article :

0 comments: