వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతోనే మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆ పార్టీ శాసనసభాపక్షం ధ్వజమెత్తింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, తెల్లం బాలరాజులు శుక్రవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
‘‘నెల్లూరు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆనం కుటుంబానికి సంబంధించిన నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనానికి కాంగ్రెస్ కొట్టుకుపోయింది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి 40 వేల మెజారిటీ రాగా.. ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్లో 35 వేల మెజారిటీ వచ్చింది. కోవూరు ఉప ఎన్నికల్లో 25 వేల మెజారిటీ, ఉదయగిరి నియోజకవర్గంలో 30 వేల మెజారిటీ రాగా.. కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు’’ అని గుర్తు చేశారు. ఇలాంటి ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయని, నెల్లూరు ప్రజానీకం వారిని వెలివేస్తారన్న భయంతోనే మతిభ్రమించి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘నెల్లూరు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆనం కుటుంబానికి సంబంధించిన నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనానికి కాంగ్రెస్ కొట్టుకుపోయింది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి 40 వేల మెజారిటీ రాగా.. ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్లో 35 వేల మెజారిటీ వచ్చింది. కోవూరు ఉప ఎన్నికల్లో 25 వేల మెజారిటీ, ఉదయగిరి నియోజకవర్గంలో 30 వేల మెజారిటీ రాగా.. కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు’’ అని గుర్తు చేశారు. ఇలాంటి ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయని, నెల్లూరు ప్రజానీకం వారిని వెలివేస్తారన్న భయంతోనే మతిభ్రమించి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
0 comments:
Post a Comment