ఉన్నత విద్యతోనే అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోగలమని వైఎస్ షర్మిల అన్నారు. చదువుతోనే పేదరికాన్ని పారదోలగలమన్ని ఆమె పేర్కొన్నారు. షర్మిల శనివారం ఉదయం విద్యా, ఉపాధి అవకాశాలపై ఖమ్మం మమత కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ విద్యార్థుల్లోని ప్రతిభను బయటకు తీసేందుకు వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో తాపత్రయపడ్డారని అన్నారు.
దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ చనిపోవడంతో పథకాలను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటంతో విద్యార్థులు చదువు కొనలేకపోతున్నారన్నారు. వైఎస్ఆర్ డాక్టర్ కావడం వలనే ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకున్నారని ఆమె అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు ఆయన డాక్టర్గా ఆలోచించడం వలనే పుట్టుకొచ్చాయని తెలిపారు. అందరూ బాగా చదివి దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడాలని షర్మిల ఆకాంక్షించారు.
దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ చనిపోవడంతో పథకాలను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటంతో విద్యార్థులు చదువు కొనలేకపోతున్నారన్నారు. వైఎస్ఆర్ డాక్టర్ కావడం వలనే ప్రజల ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకున్నారని ఆమె అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు ఆయన డాక్టర్గా ఆలోచించడం వలనే పుట్టుకొచ్చాయని తెలిపారు. అందరూ బాగా చదివి దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడాలని షర్మిల ఆకాంక్షించారు.
0 comments:
Post a Comment