విశాఖపట్నం: విద్యుత్ కష్టాలు తీరాలన్నా, విద్యుత్ కార్మికులకు మంచి రోజులు రావాలన్నా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణరావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ కాంతరెడ్డి అభిప్రాయపడ్డారు. యూనియన్ ప్రతినిధులు బుధవారం ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డెరైక్టర్లు దొర, సూర్యనారాయణలను కలసి వివిధ సమస్యలపై వినతి పత్రాలిచ్చారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2007లో జూనియర్ లైన్మెన్ల నియామకాల్లో విద్యుత్ యాజమాన్యాలు అవలంబించిన విధానాల కారణంగానే కోర్టు తప్పుబట్టిందన్నారు. పులివెందుల నుంచి అమరనాథ్రెడ్డితో పాటు 46 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీం సస్పెండ్ చేసిందని చెప్పారు. కానీ, కొందరు కార్మిక సంఘ నేతలు గొప్పలు చెప్పుకుంటూ కార్మికులను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రతినిధుల పేరిట తప్పుడు ఎస్ఎంఎస్లు ఇస్తూ తమ యూనియన్పై బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీకి లేఖ రాసినట్టు వివరించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2007లో జూనియర్ లైన్మెన్ల నియామకాల్లో విద్యుత్ యాజమాన్యాలు అవలంబించిన విధానాల కారణంగానే కోర్టు తప్పుబట్టిందన్నారు. పులివెందుల నుంచి అమరనాథ్రెడ్డితో పాటు 46 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీం సస్పెండ్ చేసిందని చెప్పారు. కానీ, కొందరు కార్మిక సంఘ నేతలు గొప్పలు చెప్పుకుంటూ కార్మికులను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రతినిధుల పేరిట తప్పుడు ఎస్ఎంఎస్లు ఇస్తూ తమ యూనియన్పై బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో విజిలెన్స్ జేఎండీకి లేఖ రాసినట్టు వివరించారు.
0 comments:
Post a Comment