కష్టకాలంలో ప్రజలవైపు నిలబడకుండా చంద్రబాబు స్వప్రయోజనాలు చూసుకున్నారని షర్మిల విమర్శించారు. సొంతమామను వెన్నుపోటు పొడిచినట్టు రాష్ట్రప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నిలబెట్టలేదు చంద్రబాబు నిలబెట్టలేదని ఆమె గుర్తు చేశారు. గుడివాడ నెహ్రూచౌక్లో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. సొంత మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. రెండెకరాలతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు వేలకోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వ్యసాయం దండగ అన్నారని, ప్రజలకు ఏదీ ఉచితంగా బాబు ఇవ్వొద్దన్నారని గుర్తు చేశారు.
కొడాలి నాని అన్నతోపాటు ఎమ్మెల్యేలు కష్టకాలంలో వైఎస్సార్ సీపీలో చేరారని తెలిపారు. వారి మీద వేటుపడుతుందని తెలిసినా... వీరు ప్రజలపక్షాన నిలబడ్డారని చెప్పారు. పదవీ వ్యామోహం వీరికా, చంద్రబాబుకా అని షర్మిల ప్రశ్నించారు. ఎన్టీ రామారావు టీడీపీని కాంగ్రెస్ మీద కోపంతో స్థాపించారని, అలాంటిది చంద్రబాబు కాంగ్రెస్తోనే కుమ్మక్కయ్యారని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్లా చంద్రబాబు ప్రజల్లోంచి పుట్టిన నాయకుడు కాదన్నారు. కుట్రలు, వెన్నుపోట్ల నుంచి ఆయన పుట్టాడన్నారు. గుడివాడ ప్రాంతంలో ఇళ్లు ఇవ్వడానికి వైఎస్ఆర్ 70 ఎకరాలు సేకరించారని, కాని ఇప్పటికీ ఇళ్లు పూర్తికాలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బాబు 16 లక్షలమందికి పింఛన్లు ఇస్తే... వైఎస్ఆర్ 71 లక్షలమందికి ఇచ్చారని తెలిపారు.
0 comments:
Post a Comment