'మా జీవితాలు దుర్భరమైపోయాయి...' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'మా జీవితాలు దుర్భరమైపోయాయి...'

'మా జీవితాలు దుర్భరమైపోయాయి...'

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

చేవెళ్ల : వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని పథకాలు అందేవని..... ప్రస్తుతం ఏ పథకం అందక తమ జీవితాలు దుర్భరమైపోయాయని వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో చేవెళ్ల ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఒకరు అధికంగా వచ్చిన కరెంట్ బిల్లులను చూపిస్తే...పింఛన్లు రావటం లేదని వృద్ధులు కన్నీరు పెట్టారు. ఏం తినాలి, ఎట్లా బతకాలని వారు ఆవేదన చెందారు. వైఎస్ బతికి ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావన్నారు.

రూ.1 కిలో బియ్యం ఇచ్చి మరోవైపు కూరగాలయల ధరలు పెంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏకష్టాలు వచ్చినా వైఎస్‌... తమ దగ్గరకు వచ్చేవారని, ఇప్పుడు తమ సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. తాగునీరు...డ్రైనేజీ, రేషన్ కార్డు, అమ్మ హస్తం సరుకులు ఇవ్వడం లేదని వారు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వృద్ధులకు ఫించన్లు పెంచుతారని ఈ సందర్భంగా విజయమ్మ హామీ ఇచ్చారు. 


Share this article :

0 comments: