ఒకవైపు కనీవిని ఎరగని రీతిలో విద్యుత్ చార్జీలను పెంచి, ప్రజల నడ్డి విరుస్తూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నిస్సిగ్గుగా తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి దుయ్యబట్టారు. ఇలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం కిరణ్ పైన చీటింగ్ కేసు నమోదు చేయాలని భూమన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజానీకంపై రూ.6,500 కోట్ల విద్యుత్ భారం మోపి కేవలం రూ.830 కోట్లు మాత్రమే మొక్కుబడిగా తగ్గించి, తన ప్రసంగాల్లో మాత్రం చార్జీలు తగ్గిపోయాయని ముఖ్యమంత్రి ఊదరగొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నెలకు 200 యూనిట్లు వాడే వారిపై భారం పడదని, సర్చార్జీలు రద్దవుతాయని సీఎం చెప్పే మాటలు తప్పని తాను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాననిఆయన పేర్కొన్నారు.
Home »
» సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి
సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి
Written By news on Monday, April 15, 2013 | 4/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment