వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి(సీఈసీ) సభ్యునిగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్రెడ్డి నియమితులయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్గా మేరుగు మురళిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. నెల్లూరు జిల్లా పార్టీ కన్వీనర్ పదవికి కాకాణి గోవర్ధన్రెడ్డి రెండు రోజులక్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్గా మెట్టా విష్ణువర్థన్రెడ్డిని నియమించినట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
Home »
» నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కన్వీనర్గా మురళి
నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కన్వీనర్గా మురళి
Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment