సీఎం కిరణ్కు వికలాంగులపై ఎటువంటి ప్రేమలేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు హయాంలో 16లక్షల మంది వికలాంగులకు పింఛన్లు అందితే వైఎస్ఆర్ హయాంలో 71లక్షల మంది వికలాంగులకు పింఛన్లను అందిందని ఆమె గుర్తు చేశారు. మరో ప్రస్థానం పాదయాత్రలో భాగంగా చెరువు మాదారంలో షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. జగనన్న సీఎం ఐతే వికలాంగులకు వెయ్యి రూపాయల చొప్పున పించన్ ఇస్తాడని హామీయిచ్చారు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తాడని చెప్పారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తాడని అన్నారు. చంద్రబాబుకు, సీఎం కిరణ్లకు బుద్ధి చెప్తే వచ్చేది రాజన్న రాజ్యమేనని షర్మిల అన్నారు.
Home »
» వికలాంగులపై సీఎంకు ప్రేమ లేదు: షర్మిల
వికలాంగులపై సీఎంకు ప్రేమ లేదు: షర్మిల
Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment