ఈనాడు, ఆంధ్రజ్యోతిపై కట్జూ అసంతృప్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనాడు, ఆంధ్రజ్యోతిపై కట్జూ అసంతృప్తి

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై కట్జూ అసంతృప్తి

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల తీరుపట్ల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రతిస్టకు భంగం కలిగేలా వార్తలు ఎందుకు ప్రచురించారని ఆయన శుక్రవారమిక్కడ ప్రశ్నించారు. ఖండన ఇచ్చినా ఎందుకు ప్రచురించలేదని అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ కమిటీ ఈరోజు హైదరాబాద్‌లో పలు కేసులను విచారించింది. 

ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతిపై ఆరు పిటిషన్లను మార్కండేయ కట్జూ పరిశీలించారు. వార్తలు రాసేటప్పుడు వివరణలు కూడా తీసుకోరా అని సూటిగా ప్రశ్నలు వేశారు. తనపై వార్త రాసి వివరణ కూడా తీసుకోలేదంటూ ఓ మహిళ కట్జూను ఆశ్రయించింది. దీనిపై స్పందిస్తూ ఆయన ఆంధ్రజ్యోతి ఎల్లో జర్నలిజానికి పాల్పడుతోందన్నారు. సర్కులేషన్, టీఆర్పీ రేటింగ్ కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా అని వ్యాఖ్యానించారు. మీ లైసెన్స్లను ఎందుకు రద్దు చేయకూడదంటూ ఆయన ప్రశ్నించారు
Share this article :

0 comments: