12న ప.గో. జిల్లాలోకి షర్మిల ప్రవేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 12న ప.గో. జిల్లాలోకి షర్మిల ప్రవేశం

12న ప.గో. జిల్లాలోకి షర్మిల ప్రవేశం

Written By news on Monday, May 6, 2013 | 5/06/2013

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 12న పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. షర్మిల పాదయాత్ర వివరాలను వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘురాం, ముదునూరి ప్రసాద రాజులు ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమె 25 రోజుల పాటు పాదయాత్ర చేస్తారు. 13 నియోజకవర్గాల్లో 225 కిలోమీటర్ల మేర నడుస్తారు. చింతలపూడి నియోజకవర్గం గురుబట్లగూడెం నుంచి జిల్లాలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. కామవరపుకోట చేరేసరికి ఆమె పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకుంటుంది.

షర్మిల పాదయాత్రపై నియోజక వర్గాల కన్వీనర్లు, పార్టీ నేతలతో బాలరాజు, తలశిల రఘురాం చర్చించారు. ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, రాజేష్ కుమార్, తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: