బాపట్లలో 5న వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నగారా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాపట్లలో 5న వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నగారా

బాపట్లలో 5న వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా నగారా

Written By news on Wednesday, May 1, 2013 | 5/01/2013


రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలుగెత్తి చాటడానికి మే 5వ తేదీన గుంటూరు జిల్లా బాపట్లలో మహిళా నగారా పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును నిర్వహించబోతుంది. ఈ సదస్సును పురస్కరించుకుని మంగళవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన నివాసంలో ‘మహిళా నగారా’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు కోన రఘుపతి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలా కుమారి, నన్నపనేని సుధ తదితరులు పాల్గొన్నారు. 

సదస్సుకు ‘సునీల’ ప్రాంగణంగా నామకరణం
ఇటీవల తెనాలి పట్టణంలో కొందరు దుర్మార్గుల చేతిలో బలైన సునీల జ్ఞాపకార్థం మహిళా సదస్సు జరిగే వేదికకు ‘సునీల ప్రాంగణం’ అని నామకరణం చేస్తున్నామని పార్టీ నేత కోన రఘుపతి తెలిపారు. మహిళల భద్రతపై ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చేందుకే బాపట్లలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు.
Share this article :

0 comments: