వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో 6న సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో బహిరంగ సభ జరగనుందని ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తెలిపారు. వేలాది మంది అనుచరులతో కలిసి తాను ఆ సభలో అధికారికంగా వైఎస్సార్సీపీలో చేరతానని వెల్లడించారు. ప్రజల కోరిక మేరకే తాను వైఎస్సార్ కాంగ్రెస్తో చేరుతున్నట్టు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో గెలిచిన తాను.. ఇప్పటి వరకు కొన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో మాత్రమే పాల్గొన్నానని, ఆ పార్టీ తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తే తన జవాబు ఏమిటో చెబుతానన్నారు. వైఎస్సార్సీపీలో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన నేతలే చేరుతున్నారు కదా అని ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘నేను బీసీ వర్గానికి చెందినవాడినే కదా. నేనూ చేరుతున్నాగా’ అని నవ్వుతూ బదులిచ్చారు.
Home »
» విజయమ్మ నేతృత్వంలో 6న కుత్బుల్లాపూర్లో సభ:కూన శ్రీశైలంగౌడ్
విజయమ్మ నేతృత్వంలో 6న కుత్బుల్లాపూర్లో సభ:కూన శ్రీశైలంగౌడ్
Written By news on Saturday, May 4, 2013 | 5/04/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment