మంత్రులు ప్రభావితం చేయలేనిది.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రులు ప్రభావితం చేయలేనిది..

మంత్రులు ప్రభావితం చేయలేనిది..

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

శక్తివంతమైన హోంశాఖలో ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కీలక శాఖలో ఉన్న ధర్మాన ప్రసాదరావు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయలేరుగానీ, వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మాత్రం సాక్షులను ప్రభావితం చేస్తారా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘జగన్ బయటికొస్తే.. సాక్షులను ప్రభావితం చేస్తారనే ఒకే ఒక్క అంశంతో ఆయనకు బెయిల్ నిరాకరించినట్లు చెబుతున్నారు.

ఎలాంటి అధికారంలో లేని జగన్ సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో చెప్పిఉంటే బాగుండేది. అధికారంలో ఉన్న మంత్రులు మూడు, నాలుగో నిందితులుగా చార్జిషీట్లలో ఉన్నారు. వారు ప్రభావితం చేయలేనిది జగన్ ఎలా చేస్తారు? ఎందుకు దానిపై వివరణ కోరలేక పోయారనేది మాకు బాధ కలిగించే అంశం’’ అని ఆయన అన్నారు. తమకైతే ఈ తీర్పుపై అనుమానాలున్నాయన్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బెణికిన కాలుకు ఫిజియోథెరపీ చేయించుకోవడానికంటూ ఉండడంపట్ల ఆయన అనుమానం వెలిబుచ్చారు.
Share this article :

0 comments: