Home »
» ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిస్థానాలు క్లీన్స్వీప్
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిస్థానాలు క్లీన్స్వీప్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాడి వీరభద్రరావు చేరడం తమకెంతో సంతోషంగా ఉందని విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గొల్ల బాబురావు అన్నారు. వచ్చ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తమ పార్టీ అన్నిస్థానాలు క్లీన్స్వీప్ చేస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.
|
కొణతాలతో విభేదాల్లేవు: దాడి
|
|
|
|
హైదరాబాద్: రాష్ట్రానికి దశా దిశా జగన్ వల్లే సాధ్యమని దాడి వీరభద్రరావు అన్నారు. వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన ఉందా, లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సీపీపై ప్రధాన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ తర్వాత పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసింది వైఎస్ఆర్ మాత్రమేనని అన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరారని చెప్పారు. సీట్లు, అధికారం తనకు ముఖ్యంకాదన్నారు. కొణతాల రామకృష్ణతో రాజకీయ వైరుధ్యాలే తప్ప వ్యక్తిగత తగాదాలు లేవన్నారు. త్వరలోనే అన్ని సమసిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
|
|
|
0 comments:
Post a Comment