ప్రజల బాధలు పట్టని ప్రభుత్వాలు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల బాధలు పట్టని ప్రభుత్వాలు: విజయమ్మ

ప్రజల బాధలు పట్టని ప్రభుత్వాలు: విజయమ్మ

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

ప్రజల బాధలు, కష్టాలు ప్రభుత్వాలకు పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. రాయలసీమకు కృష్ణా నీరు రాలేదంటే అది చంద్రబాబు పాపమే అన్నారు. ఆల్మట్టి డ్యాంను ఆపమని వైఎస్ఆర్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదంటూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు.

ఎవరిని ఉద్ధరించడానికి సీఎం కిరణ్‌ రైతు చైతన్యయాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎరువుల ధరలు 300శాతం పెంచారని, ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి జగన్‌ బాబుకు బహుమతిగా ఇవ్వాలని పార్టీ కార్యకర్తలను విజయమ్మ కోరారు.
Share this article :

0 comments: