జగన్ ప్రజల పక్షాన నిలబడతారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ప్రజల పక్షాన నిలబడతారు

జగన్ ప్రజల పక్షాన నిలబడతారు

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

న్యూజెర్సీ సభలో భూమన


మాట తప్పని, మడమ తిప్పని వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఎన్ని ఒడిదుడుకులైనా తట్టుకుని ప్రజల పక్షాన నిలుస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ ఫౌండేషన్ నేతృత్వంలో అమెరికాలోని న్యూజెర్సీలో సోమవారం జరిగిన జగన్ అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం భారీగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వైఎస్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. 

ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాత్మక శక్తిగా మారతారని పలు అంశాలు, గణాంకాలను విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎవరి సహాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌లో జగన్‌కు బెయిల్ రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబ పక్షాన నిలిచినందుకుగాను భూమన కరుణాకర్‌రెడ్డిని సురేష్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సహదేవరెడ్డిలు శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న 500 మంది అభిమానులు ముక్త కంఠంతో జగన్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ఫౌండేషన్ తరఫున ఆళ్ల రామిరెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
Share this article :

0 comments: