: కేంద్రం ఆదేశాల మేరకే సీబీఐ వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. బొగ్గు కుంభకోణంలో సీబీఐ తీరును సుప్రీంకోర్టే తప్పు పట్టిందని ఆయన గురువారమిక్కడ గుర్తు చేశారు.
సుప్రీంకోర్టుకు సీబీఐ తప్పుడు నివేదికలను అందిస్తోందని కొణతాల అన్నారు.
సీబీఐ న్యాయవాదుల తీరు సరిగా లేదని, హైకోర్టులో ఒకలా.. సుప్రీంకోర్టులో మరోలా సీబీఐ వ్యవహరిస్తోందని కొణతాల అన్నారు. ఈ కేసులో 43వేల కోట్ల రూపాయిల మేరకు అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించిందని.... అయితే ఇంతవరకూ సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ ల అన్నింటిలోనూ కలిసి వెయ్యి ముప్పయి కోట్ల రూపాయిల మేరకు మాత్రమే ఆరోపణలు చేసిందన్నారు.
అరకొర ఆరోపణలతో జగన్ కు బెయిల్ తిరస్కరించటం దురదృష్టకరమన్నారు. ఈ మొత్తం వ్యవహారం వైఎస్ జగన్ ను బయటకు రాకుండా చేసే కుట్ర అని అన్నారు. ఈకుట్ర ప్రభావంలో పడి సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వటం విచారకరమని కొణతాల వ్యాఖ్యానించారు. సీబీఐ పంజరంలో రామచిలుకలా మారిందని సుప్రీమే వ్యాఖ్యానించిందని ఆయన పేర్కొన్నారు
సుప్రీంకోర్టుకు సీబీఐ తప్పుడు నివేదికలను అందిస్తోందని కొణతాల అన్నారు.
సీబీఐ న్యాయవాదుల తీరు సరిగా లేదని, హైకోర్టులో ఒకలా.. సుప్రీంకోర్టులో మరోలా సీబీఐ వ్యవహరిస్తోందని కొణతాల అన్నారు. ఈ కేసులో 43వేల కోట్ల రూపాయిల మేరకు అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించిందని.... అయితే ఇంతవరకూ సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్ ల అన్నింటిలోనూ కలిసి వెయ్యి ముప్పయి కోట్ల రూపాయిల మేరకు మాత్రమే ఆరోపణలు చేసిందన్నారు.
అరకొర ఆరోపణలతో జగన్ కు బెయిల్ తిరస్కరించటం దురదృష్టకరమన్నారు. ఈ మొత్తం వ్యవహారం వైఎస్ జగన్ ను బయటకు రాకుండా చేసే కుట్ర అని అన్నారు. ఈకుట్ర ప్రభావంలో పడి సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వటం విచారకరమని కొణతాల వ్యాఖ్యానించారు. సీబీఐ పంజరంలో రామచిలుకలా మారిందని సుప్రీమే వ్యాఖ్యానించిందని ఆయన పేర్కొన్నారు
0 comments:
Post a Comment