హైదరాబాద్: టీడీపీకి ఇదే చివరి మహానాడని, అందుకే చంద్రబాబు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్రెడ్డి అన్నారు. మహానాడులో సొంత డబ్బాకొట్టారేకానీ చంద్రబాబు మరేమీ చెప్పలేదన్నారు. జగన్నే టార్గెట్ చేస్తూ చంద్రబాబు మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైఎస్ జగన్పై చంద్రబాబుకి ఎందుకంత ద్వేషమని నిలదీశారు.
కాంగ్రెస్, టీడీపీలు ఢిల్లీ ఆదేశాలను అమలుచేస్తున్నాయని ఆరోపించారు. బినామీ పత్రికలో జగన్పై కార్టూన్లు వేసి చంద్రబాబు తన ద్వేషాన్ని బయటపెట్టాడని అన్నారు. చంద్రబాబు ఇలాగే వ్యవహారిస్తే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. ఇకనైనా ప్రజాసమస్యలపై చంద్రబాబు దృష్టిపెడితే మంచిదని శ్రీకాంత్రెడ్డి హితవు పలికారు
|
0 comments:
Post a Comment