టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణంటూ జరిగితే ఆయన జీవితాంతం జైలులో ఉంటారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. బాబు తనపై కేసులు నమోదైనప్పుడు ఒక రకంగా, మరొకరి విషయంలో మరోలా మాట్లాడతారని విమర్శించారు. బాబు మాటలకు, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మాటలకు తేడా ఏమన్నా ఉందా? అని అడిగారు. వ్యవస్థను మేనేజ్ చేయగల సత్తా చంద్రబాబుకు ఉందని బ్రిటిష్ సంస్థ గతంలోనే చెప్పిందని గుర్తు చేశారు. తమకు కోర్టులపై నమ్మకం ఉన్నందునే విచారణను ధైర్యంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇవే కేసులు చంద్రబాబుపై ఉంటే విదేశాలకు పారిపోయి ఉండేవారన్నారు.
టీడీపీ సమావేశం మహానాడు కాదని, మహాపాడు అని అన్నారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఉన్న ఎజెండానే మహానాడులో ఉందన్నారు. చంద్రబాబు తీవ్రవత్తిడికి లోనై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా తన పాపాలు కడుక్కోవడం మంచిదని సలహా ఇచ్చారు
టీడీపీ సమావేశం మహానాడు కాదని, మహాపాడు అని అన్నారు. కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఉన్న ఎజెండానే మహానాడులో ఉందన్నారు. చంద్రబాబు తీవ్రవత్తిడికి లోనై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా తన పాపాలు కడుక్కోవడం మంచిదని సలహా ఇచ్చారు
0 comments:
Post a Comment