Home »
» మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా..
ఖమ్మం: దివంగత వెఎస్.రాజశేఖర్రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరోప్రజాప్రస్థానం యాత్ర 138వ రోజయిన శనివారం జిల్లాలో 12.3 కిలోమీటర్లు సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. జూలూరుపాడు మండలం దండుమిట్టతండా నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కొత్తగూడెం మండలంలోని వేపలగడ్డ వరకు సాగనుందని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు దండుమిట్టతండా, నర్సాపురం, కాకర్ల, మాచినపేట, కొమ్ముగూడెం, డేగలమడుగు, నాయకులగూడెం, సుజాతనగర్, వేపలగడ్డ.
|
|
0 comments:
Post a Comment