తిరుమలలో స్థానిక దుకాణ యజమానులను టిటిడి వేదిస్తే ప్రత్యక్ష్య పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి హెచ్చరించారు. తిరుమలలో దుకాణాలను సందర్శించిన కరుణాకర రెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొంతనలేని కారణాలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను, భక్తి గీతాల క్యాసెట్లను తిరుమల కొండపైకి తీసుకురాకుండా టిటిడి అడ్డుకోవడం సమంజసంకాదని ఆయన అన్నారు. కొండపై విక్రయిస్తున్న వస్తువులపై టిటిడి రాయల్టీ విధించడంతో దుకాణ యజమానులు ఆర్థికంగా దెబ్బతింటున్నారని భూమన పేర్కొన్నారు.
|
Home »
» వ్యాపారులను వేధిస్తే పోరాటం: ఎమ్మెల్యే భూమన
వ్యాపారులను వేధిస్తే పోరాటం: ఎమ్మెల్యే భూమన
Written By news on Tuesday, May 14, 2013 | 5/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment